కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర పట్టణంలో ఆదివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సిరిసిల్లా, ఎల్లారెడ్డి, రామారెడ్డి వెళ్లే రోడ్డు ప్రాంతాల్లో పోలీసుల విధులను పరిశీలించారు. ప్రజల భద్రత కోసం చలిని లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిని అభింనందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీస్ సిబ్బందికి వేడి టీ, నీటిని అందించి ప్రశంసించారు.
