బతుకమ్మ, కమ్మర్ పల్లీ: గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో రైతులకు చేసింది ఏమీ లేదని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం కమ్మర్ పల్లీ మండల కేంద్రంలో కమ్మర్ పల్లీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నర్సయ్య, పది మంచి డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తహేర్ ,రాష్ట్ర విత్తన అభివృద్ధి చైర్మన్ అన్వేష్ రెడ్డి, మనల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, గడుగు గంగాధర్, అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.