హైదరాబాద్, బతుకమ్మ : విదేశాల్లో బతుకమ్మ వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం ఢిల్లీకి బయల్దేరిన వెళ్లారు. సాయంత్రం ఢిల్లీ నుంచి ఖతార్ కు వెళ్తారు. రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు కవిత విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. 26న (శుక్రవారం) ఖతార్ లో తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటారు. 27న మల్టాకు చేరుకొని తెలంగాణ జాగృతి మాల్టా శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. 28న లండన్ కు చేరుకుంటారు. తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు.