నిజామాబాద్, బతుకమ్మ : జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జిల్లాకు చేరుకున్నారు. దేవితండాలోని జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు.
