Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2024, 5:11 pm Posted by : ramakrishna

కాళోజీ నారాయణరావు 88జయంతి వేడుకలు

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని, తెలంగాణ భాష దినోత్సవాన్ని నగరంలో సోమవారం ఘనంగా ని ర్వహించారు.  ఈ సందర్భంగా  టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ విట్టల్ రావు  మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ రంగు సీతారాం కాళోజి విగ్రహాన్ని నిజాంబాద్ జిల్లాలో మొట్టమొదటిగా బోయ గల్లి లో ఏర్పాటు చేశారని తెలిపారు. కాళోజి నారాయణరావు 1914 సంవత్సరంలో కర్ణాటకలో జన్మించాడని తెలిపారు. అయినకు రాని భాష లేనేలేదు నైజాంనిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలం గళం విప్పి కవి ఆయన 1992లో కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ విభూషణ్ ఇప్పించడం జరిగిందని తెలిపారు.  వరంగల్లో హెల్త్ యూనివర్సిటీకి కాళోజి నారాయణరావు పేరు పెట్టడం ఆ ఘనత కెసిఆర్ దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగు అపర్ణ సీతారం, తెలంగాణ శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.