కాళేశ్వరం కేసు : స్మిత సబర్వాల్ కు ఊరట
హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం కేసులో ఐఏఎస్ స్మిత సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దాఖలైనా పిటిషన్లతో కలిపి విచారిస్తామని పేర్కొంది. కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను, నోటీసుల జారీ వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని స్మిత సబర్వాల్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈనివేదికను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి చర్యలు చేపట్టకుండా మద్యంత ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.