కాకతీయ విద్యాసంస్థల అధ్యక్షుడు సుబ్బారావు మృతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాకతీయ విద్యాసంస్థల అధ్యక్షుడు, విద్యాసంస్థల ఛైర్పర్సన్ విజయలక్ష్మి తండ్రి మండవ వెంకట సుబ్బారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. కాకతీయ విద్యాసంస్థల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్యాసంస్థ ప్రారంభించిన నాటి నుంచి అహర్నిశలు పని చేశారు. కాకతీయ చిన్న విద్యాసంస్థగా మొదలై నేడు ఉమ్మడి జిల్లాలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన విషయం తెలిసిందే. సుబ్బారావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కుటుంబీకుల సానుభూతి వ్యక్తం చేశారు. సుబ్బారావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు.