Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 7:40 pm Posted by : ramakrishna

కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం

బతుకమ్మ, ఏర్గట్ల : మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో గల సొసైటీ ఫంక్షన్ హాల్ లో ఓపెన్ టు కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్ పాల్గొని క్రీడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ మదకద్రవ్యాలను వాడకూడదని నవ సమాజం నిర్మాణానికి యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించి దేశం అభివృద్ధి లో భాగస్వాములు కావాలని కోరారు. ఇలాంటి క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యతోపాటు ఐక్యతను చాటుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులందరికీ  స్నేహ స్వభావంతో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్,అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ రెడ్డి, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్,రాజేందర్, ఆనంద్,అఫీషియల్స్ పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.