నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా కె.శ్రీనివాస్ రెడ్డి ని మరో రెండేళ్లు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా రెండోసారి నియమితులైన కె.శ్రీనివాస్ రెడ్డికి టియూడబ్ల్యూజే – ఐజేయు నిజామాబాద్ జిల్లా తరపున రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొబ్బిలి నర్సయ్య, మజీద్, ప్రమోద్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు గంగదాస్, జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.అరవింద్ బాలాజీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు రాజేష్, కార్యదర్శి ధనుంజయ్ లు శుభాకాంక్షలు తెలియజేశారు.