నూతన డీజీపీ ని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే
జుక్కల్, బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో నూతన డీజీపీ గా బాధ్యతలు స్వీకరించిన సి.వి ఆనంద్ ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలిసారు. శుక్రవారం డీజీపీ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుబాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ సి.వి. ఆనంద్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.