Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 8:59 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

మోర్తాడ్, బతుకమ్మ: భీంగల్ మండలం చేంగల్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ శోభన్, ఆయన భార్య బీఆర్ఎస్ పార్టీ భీంగల్ మండలం మహిళా అధ్యక్షురాలు లావణ్య శనివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలొ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజాకర్షక పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వంలో ప్రజాసేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ముత్యాల సునీల్ కుమార్  వారికి కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేసే పార్టీని మరింత పటిష్టం చేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.