బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కుమ్మరి సహదేవ్ , ఇబ్రహీంపట్నం చిన్న భూమన్న, బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరిగిందని,అన్నారు.మోర్తాడ్ ప్రజా నిలయంలో సునీల్ కుమార్ చేతుల మీదుగా పార్టీ కండువా వేసి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని,తెలిపారు.ఇట్టి కార్యక్రమములో టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణు యాదవ్, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చెర్మెన్ పాలేపు నర్సయ్య,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవారెడ్డి,ఏర్గట్ల కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి,బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి, ఓర్సు రాములు,దండేవోయిన సాయన్న,దండెవోయిన ఆశన్న,ఏనుగంటి నర్సయ్య, దండేవోయిన సాయికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.