Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 October 2025, 3:26 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో చేరిక

వేల్పూర్, బతుకమ్మ :  వేల్పూరు మండలానికి చెందిన మాజీ ఎంవిఐ సుభాష్  నియోజకవర్గ ఇంచార్జీ సునీల్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, సీడ్స్ చైర్మన్ అవినాష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. టిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  పార్టీ కండువా కప్పి సుభాష్ ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. 1987 నుండి 1992 వరకు వేల్పూరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుభాష్ పనిచేశారు.  ప్రభుత్వ సర్వీసులో 31 సంవత్సరాలు రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Joining the Congress Party