నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఈనెల 29న కేర్ డిగ్రీ కళాశాలలో వరుణ్ మోటార్స్, మెడ్ ప్లస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉదయం 10 గంటల నుంచి కేర్ డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. జాబ్ మేళాలో పాల్గొనే విద్యార్థులు రెస్యూమ్, స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్ లను వెంట తీసుకురావాలన్నారు. ఈ ఉద్యోగ మేళాలో టాస్క్ మేనేజర్ రఘుతేజ పాల్గొంటారన్నారు.