. 11 మందికి జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో న్యాయస్థానం ఆరుగురికి జైలు శిక్ష విధించిందని ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పి ప్రసాద్ తెలిపారు. వాహనాల తనిఖీ సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 17 మంది పట్టుబడగా వారికి కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయస్థానంలో హాజరుపర్చామన్నారు. సెకండ్ క్లాస్ మెజిస్ర్టేట్ నూర్జహాన్ 11 మందికి మొత్తం రూ.15,500 జరిమానా విధించారని, అలాగే ఖానాపూర్ కు చెందిన టి సంతోష్, షేక్ సైద్, మిట్టపల్లికి చెందిన అనిల్, గౌతమ్ నగర్ కు చెందిన విఠోబా, డిచ్ పల్లికి చెందిన షేక్ ఇమామ్ కు రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని ఇన్ స్పెక్టర్ ప్రసాద్ సూచించారు