Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 December 2024, 3:55 pm Posted by : ramakrishna

మద్యం సేవించి  వాహనాలు నడిపిన 5 గురికి జైలు శిక్ష

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

మద్యం తాగి వాహనాలు నడిపిన టువంటి 19 మందికి ట్రాఫిక్  ఎస్ హెచ్ ఓ పి ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరిచారు. మంగళవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్  నూర్జాన్ 14 మందికి రూ.21,000 జరిమానా విధించారు. మిగిలిన ఐదుగురిలో నిజామాబాద్ నగరంలోని  వినాయక్ నగర్ కు చెందిన  డి నర్సింహరెడ్డికి, సితారాం నగర్ కాలనీకి చెందిన జైపాల్ లకు రెండు రోజులు జైలు శిక్ష విధించారు.  నాగారం కు చెందిన కే.అభిషేక్ , ఎడపల్లి మండలం కుర్నా పల్లికి చెందిన జి .పోశెట్టి ,  నిజామాబాద్ నగరంలోని హస్మీ కాలనీకి చెందిన శేక్ అప్రోజ్ లకు ఒక్కొక్క రోజు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు.