డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు.. జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్షా, 10 మందికి జరిమానా విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 15 మందికి ట్రాఫిక్ ఏ.సి.పి టి.నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరుపరచగా 10 మందికి 14,500 /- రూపాయలు జరిమానా, మరో ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.