బతుకమ్మ, వెబ్ న్యూస్ : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఐటీ సోదాలు కలకలం రేపాయి. టీజీలోని మహబూబ్ నగర్, ఏపీలోని గుంటూరు ప్రాంతాల్లోని పప్పు దినుసుల హోల్ సేల్ వ్యాపారుల నివాసాల్లో ఏక కాలంలో పది చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వారు చేస్తున్న వ్యాపారానికి, రికార్డుల్లో చూపించే లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరకపోడాన్ని గమనించిన ఐటీ అధికారులు ఈసోదాలకు దిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.