Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 August 2024, 3:37 pm Posted by : ramakrishna

వైద్యులపై దాడులు చేయడం సరికాదు :ఐడిఏ

బతుకమ్మ నిజాంబాద్ సిటీ : పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో ఇటీవల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిగా చదువుతున్న విద్యార్థినిపై జరిగిన ఘటనకు నిరసనగా నిజామాబాద్ నగరంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు.    ప్రజల ప్రాణాలు తమ ప్రాణాలుగా భావించి వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం కృషి చేసే వైద్యులపై ఇలాంటి దాడులు చేయడం సరికాదన్నారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వైద్యులు డాక్టర్ ప్రతాప్, డాక్టర్ సుగుణాకర్, డాక్టర్ కవిత, డాక్టర్ స్వరూప, రఘు, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.