Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 7:25 pm Posted by : ramakrishna

జిల్లావాసి డీఈఓగా రావడం అభినందనీయం

  • టీఎస్ యూటీఎఫ్ జిల్లా  అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  : మన జిల్లావాసి మనకు డీఈఓ గా రావడం అభినందనీయమని టీఎస్ యూటీఎఫ్ జిల్లా  అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సత్యానంద్, ఓరమేష్ అన్నారు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన  పి. అశోక్ కుమార్ కు టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ  సందర్భంగా  జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడారు.  కుల గణన విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి. సిరాజుద్దీన్, జిల్లా కోశాధికారి ఎం. మల్లేష్, జిల్లా కార్యదర్శులు జి.గంగాధర్, ఎన్. రాజారామ్, వి. సాయన్న, జి. ఆనందం, డి. బాబులు, జిల్లా కమిటీ సభ్యులు ఈ. శ్రీనివాస్, ఎం. బాజన్న, ఎం. రవీందర్, సోన్ పేట్ గంగాధర్ పాల్గొన్నారు.