Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2024, 5:40 pm Posted by : ramakrishna

ఎల్ ఓ సి అందజేత

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ మున్సిపాలిటీ లోని కోటార్మూర్ (పెర్కిట్)కి చెందిన దొండ రాములు కి ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈ విషయాన్ని 5వ వార్డు కౌన్సిలర్ శాల ప్రసాద్ వినయ్ రెడ్డి కు చరవాని ద్వారా విషయాన్ని తెలపడంతో ఆయనను నిమ్స్ ఆసుపత్రి లో చేర్పించి వారి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో దొండ రాములు చికిత్స కోసం స్థానిక ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి కి సంప్రదించడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,50,000 వేల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ( ఎల్ ఓ సి )అందించడం జరిగింది. అదేవిధంగా చికిత్సకు కావలసిన ఏర్పాట్లు చేసి నిమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని వైద్యులను కోరారు ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి ప్రత్యేక చొరవ చూపినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.