బతుకమ్మ, కమ్మర్ పల్లి : బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన చింత పద్మ రూ.26 వేలు,ఆదే రాజేష్ రూ.20వేలు,సున్నపు గంగు రూ.17 వేలు,లాండేరి వైష్ణవి రూ.20 వేలు,నాగేష్ రూ.9 వేలు,గంగామణి రూ.20 వేలు అదేవిధంగా నర్సాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ జనార్దన్ రూ.32 వేలు రూపాయలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.