Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2025, 6:30 pm Posted by : ramakrishna

శివ మహాపురాణం కథకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఈనెల 8 నుంచి 14 వరకు జరిగే శివ మహాపురాణం కథలో పాల్గొనాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి రాజస్థాన్ మార్వాడి సమాజ్ సభ్యులు హరీష్ కుమార్ హేడా పరశురాం, సంఘ సేవకులు బోబిడే గంగా కిషన్ లు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ లోని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్వగృహంలో శనివారం ఎమ్మెల్యేను కలిశారు. వారం రోజులపాటు జరిగే శివ మహాపురాణం కథలో పాల్గొనాలని కోరారు. శివ మహాపురాణం కథను గుజరాత్ లోని అహ్మద్ నగర్ కు చెందిన యుగల్ శరన్ మహారాజ్ కథను చెబుతారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ శివ మహా పురాణం కథలో తాను కుటుంబ సమేతంగా పాల్గొంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ హెడా, సర్వేశ్వర్ దుడ్వాని, హరిప్రసాద్ జీ లడ్డ పాల్గొన్నారు.