Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 7:43 pm Posted by : ramakrishna

సమస్యలను సమాజానికి పరిచయం చేయడం అభినందనీయం

నిజామాబాద్, బతుకమ్మ : కాలేజీ  యాజమాన్యాలు ఎదుర్కొంటున్న  సమస్యలను సమాజానికి పరిచయం చేయడం అభినందనీయమని ట్రస్మా అధ్యక్షులు లయన్ కొడాలి కిశోర్ అన్నారు. నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వ ర్యంలో చట్టం సీఈవో సిరిగాధ ప్రసాద్ ను ట్రస్మా అధ్యక్షుడు లయన్ కొడాలి కిషోర్ శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో స్కూల్, కాలేజీల వ్యవస్థ పై కళ్ళకు కట్టినట్లుగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు చూపేందుకు కృషి చేసిన చట్టం టివి, చట్టం దినపత్రిక యాజమాన్యం, సిబ్బందిని అభినందించారు. అంతే కాకుండా కాలేజి యాజమాన్యం నేడు ఎదుర్కొంటున్న సమస్యలను సమాజానికి పరిచయం చేయడం సంతృప్తిగా ఉందని అన్నారు.