అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

బతుకమ్మ,వేల్పూర్ :-అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల వేల్పూర్ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు  కె.రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులకు పిడి రాజేందర్, దివ్యాంగుల ఉపాధ్యాయులు ప్రసాద్  ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహిచారు. గెలుపొందిన విద్యార్థులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు బోడ దేవనందం, ఉపాధ్యాయులు శైలజ, వనిత, దేవ శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.