రుద్రూర్, బతుకమ్మ: రాబోయే వేసవి కాలంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా కొరకు, విద్యుత్ అంతరాయాలను తగ్గించడానికి, రుద్రూర్ సెక్షన్ పరిధిలోని అక్బర్ నగర్ సబ్ స్టేషన్ లో శనివారం నూతనంగా 11 కెవి అక్బర్ నగర్ ఫీడర్ కు వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఏర్పాటు చేసి మోహమ్మద్ ముక్తార్ డివిజనల్ ఇంజనీర్ చేత చార్జ్ చేయబడినది. గతంలో 11 కేవీ అక్బర్ నగర్ టౌన్, 11 కెవి బొప్పాపూర్ వ్యవసాయ ఫీడర్లకు, రెండు ఫీడర్ లకు కలిపి ఒకే విసిబి ఉండడంవల్ల అంతరాయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అదనముగా 11 కె.వి అక్బర్ నగర్ టౌన్ కు విసిబి ఏర్పాటు చేసి నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కె. నగేష్ కుమార్ అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ రుద్రూర్, ఏఈ శ్రీనివాస్, రుద్రూర్ సెక్షన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.