నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని తిమ్మానగర్ రోడ్డు గల మాజీ సర్పంచ్ విజయలక్ష్మి జొన్న మోహన్ రెడ్డి నివాస ప్రదేశంలో గృహ అవసరాల కోసం ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు మాజీ సర్పంచ్ జొన్న మోహన్ రెడ్డి తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే సహకారంతో రూ.14 లక్షలతో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ప్రతి మండలంలో సిసి రోడ్లను మంజూరు చేయించి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.