Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 8:05 pm Posted by : ramakrishna

నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు

ఏర్గట్ల, బతుకమ్మ :

 

తొర్తి  గ్రామంలో త్వరలో జరగనున్న వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి రథోత్సవానికి విద్యుత్ తీగలు తగలకుండ తక్కువ ఎత్తుగల పాత విద్యుత్ స్థంబాలస్థానం లో కొత్త విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కౌడ భూమేశ్వర్ సహకారంతో సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయల నిధులతో విద్యుత్ స్తంభాల పనులను పూర్తి చేయించారు. దాంతో చాలా కాలం కిందట వేసిన, డ్యామేజ్ అయిన పాత విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను బిగించినందుకు గ్రామ సర్పంచ్ కు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.