నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజామునుంచి ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. వీక్లీ బజార్ చౌరస్తా, తిరమల టాకీస్, బర్కత్ పురా, షిఫా మెడికల్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
