పౌల్ట్రీ ఫారమ్స్ తనిఖీ
రుద్రూర్, బతుకమ్మ : యూరియా అక్రమ వినియోగాలను అరికట్టే భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో గల పౌల్ట్రీ ఫారమ్స్ ను తహసీల్దార్ తారాబాయి, మండల వ్యవసాయ అధికారి సాయి కృష్ణ, రుద్రూర్ ఎస్సై సాయన్నలు తనిఖీ చేశారు. ఏదైనా ఉపయోగానికి యూరియా వాడుతున్నారా అని పౌల్ట్రీ ఫారం యజమానిని ఆరా తీశారు. అదేవిధంగా కోళ్లకు తినడానికి ఉపయోగించే ఆహార నిల్వలను పరిశీలించారు.