Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 5:32 pm Posted by : ramakrishna

దెబ్బతిన్న పంట పరిశీలన

మద్నూర్, బతుకమ్మ: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను శనివారం అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మధుర మండలం గుజరావ్ గ్రామంలో పంటలను అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పంటలను పరిశీలించాడనికి వచ్చిన అధికారులు ప్రజా ప్రతినిధుల్లో వద్ద రైతులు తమ బాధను చెప్పుకున్నారు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. తహసిల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, వ్యవసాయ అధికారి రాజు, ఎస్ఐ విజయ్ కొండ, గ్రామ కార్యదర్శి గ్రామ బాధిత రైతులు తదితరులు ఉన్నారు.