ఇందిరమ్మ ఇళ్ల  నిర్మాణ పనుల పరిశీలన

జుక్కల్, బతుకమ్మ :  జుక్కల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీవో శ్రీనివాస్  శనివారం పరిశీలించారు. జుక్కల్ లో 68 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. 30 ఇందిరమ్మ ఇళ్ల   నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.  జుక్కల్ లో  లబ్ధిదారు  నిర్మల ఇంటి  పనులను ఎంపీడీవో పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బీపీ చెక్ చేసుకున్నారు. 30 పడకల ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో  30 పడుకల ఆసుపత్రి సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.