పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల వినూత్న ప్రదర్శన

డిల్లీ, బతుకమ్మ : పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల వినూత్న ప్రదర్శన చేపట్టారు. మింతాదేవి బొమ్మతో కూడిన టీ షర్టులు ధరించి నిరసన తెలిపారు. ఇటీవల విడుదలైన బీహార్ ముసాయిదా ఓటరు జాబితాలో మహిళ మింతాదేవి మొట్టమొదటి ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఆమె వయసు 124 సంవత్సరాలు.  '124 నాట్ అవుట్' అనే నినాదాన్ని టీ షర్ట్ పై రాసుకుని ఎంపీల ప్రదర్శన నిర్వహించారు.