Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2024, 12:03 pm Posted by : ramakrishna

మున్నూరుకాపు కార్పొరేషన్ కోసం మౌన దీక్ష

బతుకమ్మ, మాచారెడ్డి: మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం మాచారెడ్డి మండల కేంద్రంలో ఆ సంఘం ప్రతినిధులు

మౌన దీక్ష చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు  జిల్లా నాయకులు రావుల ప్రభాకర్, గ్రామ అధ్యక్షుడు ముదాం నర్సింలు  ఆధ్వర్యంలో నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని మౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా మున్నూరు కాపులు తగిన ప్రాధాన్యతకు నోచుకోలేదన్నారు. గత ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఇచ్చిన హామీని విస్మరించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా తమకిచ్చిన హామీ ని నెరవేర్చాలని కోరారు.  కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షుడు మ్యాడ ప్రభాకర్, సలహాదారులు శ్రీకాంత్, శ్రీనివాస్, కల్పన, ముదాం లక్ష్మి, రాజమణి, క్రాంతి కుమార్, నవీన్, నిఖిల్, భరత్, సూరజ్, శివచరణ్ తదితరులు పాల్గొన్నారు.