ఎస్సారెస్పీ లోకి 4500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
మెండోరా, బతుకమ్మ: గత రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 4500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారి ఏఈ రవి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా శనివారం ప్రాజెక్టులో 1069.1 అడుగులు, 21.882 టీఎంసీల నీరు నిలువ ఉంది. జూన్ 1వ తేదీ నుండి శనివారం వరకు ప్రాజెక్టులోకి 11. 744 టీఎంసీల నీరు వచ్చి చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.