Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2024, 7:52 pm Posted by : ramakrishna

ట్రస్మా జిల్లా అధ్యక్షునిగా ఇందూరు కిషోర్ ఏకగ్రీవ ఎన్నిక

 8న ప్రమాణ స్వీకారోత్సవం

బోధన్, బతుకమ్మ : తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్  నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. బోధన్ లోని ఇందూరు పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఈ నెల 8న  నిజామాబాద్ లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడం జరుగుతుందని,  ప్రతి ఒక్కరు హాజరుకావాలని బుధవారం బోధన్ లోని ఇందూరు బిఎడ్ కళాశాలలో బోధన్ పట్టణ ప్రైవేట్ స్కూల్ కాలేజ్ అసోసియేషన్  అధ్యక్షుడు ముత్యాల హరి కృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల కళాశాలల నిర్వాహకులు హాజరు కావాలని  తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ వస్తుందని, వారికి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామని, పరిష్కారానికి కృషి చేస్తానని,  బోధన్ వాసులు తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా  ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.