ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తాడ్వాయి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలోని ఇందిరమ్మ లబ్ధిదారు మమత నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకోవాలని లబ్ధిదారుకు సూచించారు. అదేవిధంగా ఈ గ్రామంలో 32 ఇండ్లు మంజూరు కాగా 12 ఇండ్లకు మార్కౌట్ ఇవ్వడం జరిగిందని వాటిలో మూడు ఇండ్లు బేస్మెంట్...