Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2024, 6:47 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలి

అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్

కామారెడ్డి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు , భూముల వివరాలు పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచి కరమైన భోజనం అందించాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్, ఎంపిడిఒ లు ఉన్నారు.

Indiramma house survey should be conducted as per government guidelines