వెబ్ డెస్క్, బతుకమ్మ : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగుల చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73, 96బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్) అర్థ శతకం బాదాడు. అలెక్స్ కేరీ (61, 57బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధ శతకం బాదారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3, రవీంద్ర జడేజా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్సర్ పటేల్, హార్థిక పాండ్య ఒక్కొ వికెట్ పడగొట్టారు. భారత్ లక్ష్యం 50 ఓవర్లలో 265 పరుగులు.