Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 10:24 am Posted by : ramakrishna

పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు

ఆపరేషన్ సిందూర్ పేరు త్రివిధ దళాల సంయుక్త  ప్రణాళిక

దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం

డిల్లీ, బతుకమ్మ : పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ ల మధ్య తీవ్ర  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కీలక పరిణామం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ పేరుతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా ఉగ్రస్థావరాలపై మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకీ జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.  ఈదాడుల్లో పాక్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు క్యాంపులను టార్గెట్ చేసింది. ఇందులో జైషే మహ్మద్ కు చెందిన నాలుగు, లష్కరే తోయిబాకు చెందిన నాలుగు క్యాంపులు, రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి. ఈదాడుల్లో ఇప్పటి వరకు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.