రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు గూడూరు ప్రశాంత్ గౌడ్, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇత్తడి నాగరాజకుమారి, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, మండల ఉపాధ్యక్షులు భోజిగొండ అనిల్, బేగరి వినోద్ కుమార్, గుడిసె ప్రభాకర్, జీలకర్ర విజయ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, జి.శివకుమార్, మండల సీనియర్ నాయకులు, పార్వతి మురళి, బీవీ గుప్తా, చిదురా మహిపాల్, సుధాకర్, గొల్లశంకర్, బూత్అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.