Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2025, 5:34 pm Posted by : ramakrishna

స్వతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ  ఆధ్వర్యంలో నగరం లోని సరస్వతి నగర్ లో గల కార్యాలయం వద్ద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పతాకావిష్కరణ  చేసిన అనంతరం మాట్లాడుతూ  ఎందరో మానీయుల ఉద్యమ త్యాగ ఫలితం గా సాధించిన  స్వతంత్రని నేడు స్వచ జీవనాన్ని  గడుపుతున్నామని  దేశ సార్వభౌమత్వానికి సవాలు గా మారిన పాక్  ప్రేరేపిత  తీవ్ర  వాదాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం సమర్థవంతంగా  తిప్పి కొట్టిందని సైన్యం ధైర్య సాహసం అభినందనీయం నేటి యువత దేశ భక్తుతో దేశ  అభివృద్ధి కోసం ముందుకు సాగాలన్నారు. కార్యక్రమం లో  పరిషత్ న్యాయవాదులు బండారి కృష్ణానంద్,  కార్తన్ గణేశ్, పదేగేల వెంకటేశ్వర్, సుదర్శన్ రెడ్డి, విగ్నేష్,  వెంకట రామనగౌడ్,  రవి, జేపీ లోహియా, సురేశ్, తోట శ్రీనివాస్, సింగం అంజలి, తదితరులు పాల్గొన్నారు.

Independence Day celebrations