రాష్ట్రస్థాయి బేస్ బాల్  పోటీలకు ఇందల్వాయి యువకుడి ఎంపిక 

ఇందల్వాయి,బతుకమ్మ : రాష్ట్రస్థాయిలో బుధవారం నుండి 21 వరకు హైదరాబాద్ లోని  ఎల్బి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ బేస్ బాల్ పోటీలకు ఇందల్వాయి  గ్రామానికి చెందిన కొటాల  శ్రీకర్ ఎంపిక అయినట్లు బేస్ బాల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి  మధుసూదన్ రెడ్డి,సొప్పారి వినోద్ లు తెలిపారు.ఈయన ఎస్ ఎస్ ఆర్  జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం సీఈసీ విభాగంలో చదువుతున్నట్టు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్  కార్యదర్శి మర్కంటి  గంగా మోహన్,పిడి  కొటాల సంజీవ్, కోచ్ నరేష్ ,పాల్గొన్నారు.