Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 December 2024, 6:59 pm Posted by : ramakrishna

సావిత్రి బాయి పూలే పురస్కారాల కరపత్రాల ఆవిష్కరణ

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : జనవరి 5వ తేదీన బిసిటియు ఆధ్వర్యంలో నిర్వహించే సావిత్రి బాయి పూలే పురస్కారాల కరపత్రాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గొప్ప సంఘసంస్కర్త అని భారత దేశ చరిత్రలోనే స్త్రీ విద్యను ప్రవేశ పెట్టిన ఘనత ఆమెది అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్,ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ,వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ,అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్,గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు,ఉపాధ్యక్షులు మహేందర్,మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్,పిఅర్ టియు అధ్యక్షులు మోహన్ రెడ్డి,నవీపేట్ ఎం ఇ వో అశోక్ తదితరులు పాల్గొన్నారు.