కొత్త కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో గురువారం నూతన కంప్యూటర్ ల్యాబ్ను ప్రిన్సిపాల్ డా. పి. రామ్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గుత్ప భూమా రెడ్డి కంప్యూటర్ ల్యాబ్ కోసం తొంబయివేల రూపాయలతో కావలసిన ఫర్నిచర్ ను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా భూమారెడ్డి మాట్లాడుతూ తాను వసతులు లేని కాలంలో సాధారణ డిగ్రీలో భాగంగా సాంకేతికతను చదువుకొని విదేశాలలో కంప్యూటర్ రంగంలో స్థిరపడటం జరిగిందని, ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ ఉండే విద్యార్థులకు ఇటువంటి సౌకర్యాలు అందితే...