మాతా శిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నూతనంగా నిర్మించిన మాతాశిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్ కేర్ యూనిట్ నూతన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, ధన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్తా, నుడా ఛైర్మన్‌ కేశ వేణు, సహకార...