విశ్వవిద్యాలయంలో చదువుతోపాటు  పరిశోధనలపై కేంద్రీకరించాలి 

రిటైర్డ్ లెక్చరర్  ఏ.భుజంగం నిజామాబాద్ సిటి, బతుకమ్మ : విశ్వవిద్యాలయంలో చదువుతోపాటు  పరిశోధనలపై కేంద్రీకరించాలని రిటైర్డ్ లెక్చరర్  ఏ.భుజంగం అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం  ప్రిన్సిపల్  ఆచార్య సిహెచ్  ఆరతి  అధ్యక్షతన  పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ లెక్చరర్  ఏ.భుజంగం హాజరై ప్రసంగిస్తూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని విశ్వవిద్యాలయ వనరులను వినియోగించుకొని  అత్యుత్తమంగా ఎదగాలన్నారు.  విద్యార్థి జీవితంలో సమయం చాలా ముఖ్యమైనదని, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లే  విజేతలుగా నిలబడ్డారన్నారు.  సహజంగా ...