Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 4:49 pm Posted by : ramakrishna

డిసిసి రేసులో ఇమ్మడి గోపి

  • ఆయన ఆయుధమే అభివృద్ధికి పునాది
  • ప్రజల సంక్షేమమే ఆయన లక్ష్యం

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంనికి చెందిన మాజీ ఉమ్మడి ఎంపీపీ ఇమ్మడి గోపి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్, కమిటీ పార్టీ అధ్యక్షులుగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అనుకూలంగా సానుకూలంగా సహకరించాలని పిసిసి మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి,అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. నామినేషన్ దాఖలు వేసిన విషయాన్ని లింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి తెలిపారు. ఆయుధం అంటేనే జిల్లాలోని ప్రజలు,మండలాలు గ్రామాల,అభివృద్ధి లక్ష్యమే తన కర్తవ్యం అని తెలిపారు. ప్రజలకు అభివృద్ధి చేసే నాయకులకే అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు.అధిష్టానం ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. ప్రజాభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకులను గమనించి వారికే డీసీసీ పగ్గాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.ఆయన అన్నారు అభివృద్ధి చేసే వారికి డిసిసి పగ్గాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అధిష్టానం అభివృద్ధి చేసే నాయకుడిని గుర్తించి పగ్గాలు చేపట్టాలని కోరారు.