నిజామాబాద్, బతుకమ్మ: బైపాస్ లోని నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని ఐఎంఏ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని, రోగులను కాపాడే సందర్భంలో డాక్టర్లు ఎంతో కృషి చేస్తారని అన్నారు. దేవుడు తర్వాత డాక్టర్లను దేవుడుగా కొలుస్తారని, అంత పవిత్రమైన వైద్యవృత్తి అని అన్నారు. సన్మాన కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్, డాక్టర్ రాజేంద్రప్రసాద్,డాక్టర్ రవీందర్ రెడ్డి డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ రమేశ్వర్, తదితరులు ఉన్నారు.