గొర్రెపాటి మాధవ రావుకు ఐఎఫ్టీయు నివాళి
నిజామాబాద్, బతుకమ్మ : అలుపెరగని మానవ హక్కుల ఉద్యమ బాటసారి, సీనియర్ న్యాయవాది, మానవ హక్కుల వేదిక తెలంగాణా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గొర్రెపాటి మాధవ రావుకు శనివారం ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మరణించిన అనంతరం తన కళ్లను, పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు దానమిచ్చి మరణంలో సైతం ఆదర్శంగా నిలిచారని కామ్రేడ్ మాధవరావును వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు నాయకులు నీలం సాయిబాబా, శివకుమార్ లు మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు గొంతులేని పేద బడుగు బలహీనవర్గాలకు, తాను గొంతై ...